వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబు

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబు

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబు

సత్తెనపల్లి: అవినీతిలో కూరుకుపోయి అస్తవ్యస్తమైన పరిపాలన చేస్తున్నందుకు వ్యతిరేకంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచావు కాబట్టి వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్నాడని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకుడు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. సత్తెనపల్లిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి అవ్వడానికి ఏకంగా మామకు ఎలా వెన్నుపోటు పొడించావో ప్రజలు గమనించారన్నారు. ఈ రోజు యావత్‌ ప్రజానికానికి వెన్నుపోటు పొడుస్తున్నావు కాబట్టి, జాగ్రత్త అంటూ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో తలపెట్టిన వెన్నుపోటు దినం విజయంతం చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నోరు తెరవకుండా ఉండాలని, వందలాది మందిని హత్య చేయించాడని, వందలాది మందిపై హత్యా నేరాలు మోపాడన్నారు. వేలాది మందిపై కేసులు పెట్టడం పరాకాష్టకు చేరిందన్నారు. గ్రామాలు, ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితి తెచ్చాడని, వాళ్లు చేసే అవినీతిని ఎవరూ ప్రశ్నించ కూడదనే పద్ధతిలో తీసుకొస్తున్నాడన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, కానీ ఏడాది కాలంలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దినం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, పక్కాల సూరిబాబు, చల్లంచర్ల సాంబశివరావు, రాజారపు శివనాగేశ్వరరావు, రాయపాటి పురుషోత్తమరావు, భవనం రాఘవరెడ్డి, నక్కా శ్రీను, షేక్‌ మౌలాలి, మర్రి సుబ్బారెడ్డి, కళ్లం విజయభాస్కరరెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

గద్దెనెక్కడానికి చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు

అవినీతిని ప్రశ్నించే వారిపై

అక్రమ కేసుల బనాయింపు

వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకుడు పూనూరు గౌతంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement