
పెన్షనర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని పెన్షనర్ల బిల్డింగ్లో అధ్యక్షులు మానం సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం పల్నాడు జిల్లా శాఖ పెన్షనర్ల సంఘ ఏప్రిల్ నెల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గౌరవాధ్యక్షులు లంకా రంగనాయకులు, కార్యదర్శి సీసీ ఆదెయ్య, కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాదు, అసోసియేషట్ ప్రెసిడెంట్ కంచుపర్తి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి పచ్చల నాగభూషణం, ఉపాధ్యక్షులు చేగిరెడ్డి ఈశ్వరరెడ్డి, పూనాటి సుబ్బారావు పాల్గొన్నారు. కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాదు 2024–25 ఏడాదికి పైనాన్స్ స్టేట్మెంట్ను ప్రవేశపెట్టారు. హెల్త్, గుర్తింపు కార్డుల గురించి చర్చించారు.