భువనేశ్వర్: ఈ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఏసీఏ కార్యదర్శి ఆర్.సత్యసాయి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి.ఆనందరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటికి ప్రత్యేకంగా ఆహ్వా నించారు. ఉత్సవాలకు ప్రత్యక్షంగా హాజరవుతా నని ప్రతినిధి బృందానికి గవర్నర్ తెలియజేశారు. ఎంపీ అపరాజిత షడంగి, ఎమ్మెల్యే అనంత నారాయణ జెనాకు ఏసీఏ ఆహ్వాన పత్రికలు అందజేసింది.


