నవంబర్‌ 12న యాదవ మహాసభ | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 12న యాదవ మహాసభ

Oct 28 2025 7:30 AM | Updated on Oct 28 2025 7:30 AM

నవంబర్‌ 12న యాదవ మహాసభ

నవంబర్‌ 12న యాదవ మహాసభ

కంచిలి: అఖిల భారత యాదవ మహాసభ సమావేశాన్ని నవంబర్‌ 12వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలియజేశారు. ఆరోజున సోంపేట పట్టణంలోని వీబీఆర్‌ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ విషయమై కంచిలిలో రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలోని సంఘ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ మహాసభకు జిల్లావ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యాదవుల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. సమావేశంలో రాపాక చిన్నారావు, నర్తు ప్రేమ్‌కుమార్‌, సాలిన లక్ష్మణమూర్తి, ఈశ్వరరావు, జోగారావు, వెంకటరావు, దాలయ్య, రామదాసు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement