భువనేశ్వర్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక | - | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక

Jul 17 2025 3:18 AM | Updated on Jul 17 2025 3:18 AM

భువనేశ్వర్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక

భువనేశ్వర్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక

భువనేశ్వర్‌: మరుగున పడిన భువనేశ్వర్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక ఆరంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ అధ్యక్షతన బుధవారం స్థానిక లోక్‌ సేవా భవన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టు పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం తీర్మానం మేరకు ప్రాజెక్టు కార్యాచరణ కొనసాగించేందుకు ఉప ముఖ్యమంత్రి కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ అధ్యక్షతన అంతర్‌ మంత్రిత్వ ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ నివారణ, నియంత్రణ దృష్ట్యా మెట్రో రైలు ప్రాజెక్టు అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అస్పష్టమైన కారణాలతో ఈ ప్రాజెక్టు మరుగున పడింది. అంతర్‌ మంత్రి మండలి దీనిపై చొరవ కల్పించుకుని ముందకు సాగించాలని నిర్ణయించడం విశేషం. ఈ సమావేశంలో మంత్రులు సంపద్‌ చంద్ర స్వంయి, పృథ్వీరాజ్‌ హరిచందన్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సీఈఓ కళ్యాణ్‌ పట్నాయక్‌, సీనియర్‌ అధికారులు వికాష్‌ కుమార్‌, ప్రమిత్‌ గర్గ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement