
పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్ తాఖీదు జారీ
భువనేశ్వర్: పూరీ రథ యాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాఖీదులు జారీ చేసింది. పూరీ జిల్లా కలెక్టర్ పోలీసు సూపరింటెండెంట్ వివరణ కోరుతూ ఈ తాఖీదులు జారీ అయ్యాయి. ఈ విచారకర సంఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ఆదేశించింది. మిగిలిన రథయాత్రను సరైన పద్ధతిలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది.
నందన్ కానన్లో పసుపు అనకొండల జననం
భువనేశ్వర్: నగరం శివార్లు బారంగ్ నందన్ కానన్లో 7 అనకొండ పాము పిల్లలు జన్మించాయి. 2019 సంవత్సరంలో చైన్నెలోని మద్రాస్ క్రోకోడైల్ బ్యాంక్ ట్రస్ట్ నుండి తీసుకువచ్చిన ఒక జత అనకొండలు రెండో సారి ఈ పిల్లల్ని జన్మనిచ్చాయి. వీటితో జంతు ప్రదర్శనలో అనకొండల సంఖ్య 14కి చేరింది.

పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్ తాఖీదు జారీ