జాతీయ గణాంకాలతోనే నిధుల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

జాతీయ గణాంకాలతోనే నిధుల కేటాయింపు

Jun 30 2025 7:23 AM | Updated on Jun 30 2025 7:23 AM

జాతీయ

జాతీయ గణాంకాలతోనే నిధుల కేటాయింపు

పర్లాకిమిడి: జాతీయ గణాంకాల వల్ల దేశంలో వ్యవసాయం, భారీ నీటి పథాకాలు, ప్రధాన మంత్రి సఫలయోజనా పథకం, జాతీయ నమూనా, కృషి జన గణాంకాలతోనే వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరుగుతాయని జిల్లా కలెక్టర్‌ బిజయ కుమార్‌ దాస్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో 19వ జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దివంగత ప్రొఫెసర్‌ ప్రశాంత చంద్ర మహాలనోబిస్‌ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి కలెక్టర్‌ మాట్లాడుతూ.. జాతీయ గణాంకాల దినోత్సవాన్ని 2007 నుండి దేశవ్యాప్తంగా ప్రొఫెసర్‌ ప్రశాంత చంద్ర జన్మదినం నాడు జరుపుకుంటారని గుర్తు చేశారు. దేశ సామాజిక, అర్ధనైతిక, వార్షిక, నీతి అయోగ్‌ పథకాలు తయారు చేయడానికి జాతీయ గణాంకాలు దోహద పడతాయని డిప్యూటీ డైరెక్టర్‌ కులమణి రౌతో అన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళికా, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోగా, అతిథులుగా సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, జిల్లా గణాంకాల డిప్యూటీ డైరెక్టర్‌ కులమణి రవుతో, ఎస్‌కేసీజీ కళాశాల ఎకానమిక్స్‌ అధ్యాపకులు సంజయ్‌ కుమార్‌ సాహు పాల్గొన్నారు.

పర్లాకిమిడిలో 19వ జాతీయ గణాంకాల దినోత్సవం

జాతీయ గణాంకాలతోనే నిధుల కేటాయింపు 1
1/1

జాతీయ గణాంకాలతోనే నిధుల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement