ఎగ్జిబిషన్‌ సందర్శనకు పోటెత్తిన జనం | - | Sakshi
Sakshi News home page

ఎగ్జిబిషన్‌ సందర్శనకు పోటెత్తిన జనం

Jun 30 2025 7:23 AM | Updated on Jun 30 2025 7:23 AM

ఎగ్జి

ఎగ్జిబిషన్‌ సందర్శనకు పోటెత్తిన జనం

జయపురం: జయపురం మహారాజా రాజర్శి విక్రమదేవ్‌ వర్మ 157వ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం స్థానిక శ్రీవిక్రమ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కళాశాలలో సిటీ ఆఫ్‌ విక్టరీ జయపుర ఫొటోఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. జయపురం రాజుల నాటి ఫొటోలను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం అనేక మంది యువకులు, ముఖ్యంగా వివిధ కళాశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చి ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఇన్‌టేక్‌ కొరాపుట్‌ చాప్టర్‌, శ్రీవిక్రమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కళాశాల జయపురం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫొటో ప్రదర్శనలో జయపురం మహారాజుల కాలం నాటి ఫొటోలను తిలకించిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రదర్శన చూడటం ఇదే ప్రథమమంటున్నారు. ఇక ముందు కూడా ఎంతో చారిత్రిక నేపథ్యం ఉన్న జయపురం సామ్రాజ్యంపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే చరిత్రను తెలుసుకొనేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎగ్జిబిషన్‌ సందర్శనకు పోటెత్తిన జనం 1
1/1

ఎగ్జిబిషన్‌ సందర్శనకు పోటెత్తిన జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement