
మంచినీటికి బదులు మురుగునీరు సరఫరా!
కొరాపుట్: ప్రజారోగ్య శాఖ పంపీణీ చేస్తున్న మంచినీటికి బదులు మురుగు నీరు (ఎర్రటినీరు) వస్తుంది. నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి తుంబర్ల గ్రామ పంచాయతీ దన్సులి గ్రామంలో మంచినీటికి బదులు మురుగు నీరు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా ఈవిధంగా దుర్గంధంతో కూడిన నీరు సరఫరా అవుతున్నటుట స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని సర్పంచ్ దృష్టికి తెచ్చారు. సర్పంచ్ ఉన్నతాధికారులకు నివేదించినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం గురువారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అధికారులు గ్రామానికి పరుగులు తీసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

మంచినీటికి బదులు మురుగునీరు సరఫరా!