
మూడు గంటలు నరక యాతన!
కొరాపుట్: ప్రమాదం జరిగిన ట్రక్లో ఇరుక్కుని డ్రైవర్ మూడు గంటలు నరక యాతన పడ్డాడు. శుక్ర వారం వేకువ జామున 2.30 గంటల సమయంలో జయపూర్–నబరంగ్పూర్ మార్గంలో హరడాపుట్ గ్రామం వద్ద 26వ నంబర్ జాతీయ రహదారిపె నిలిపి ఉన్న ట్రక్ని పాల ట్యాంకర్ ఢీకొట్టింది. ఉమ్మర్కోట్ నుంచి విశాఖపట్నానికి పాల లోడుతో వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ గురునాం సింగ్ తన సీటులో చిక్కుకు పోయాడు. పోలీసుల సమాచారంతో జయపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హైడ్రాలిక్ కుంబి టూల్స్ వినియోగించి సుమారు మూడు గంటల ప్రత్యేక ఆపరేషన్ ద్వారా డ్రైవర్ని బయటకు తీసి జయపూర్లోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఫైర్ స్టేషన్ అధికారి సురేష్ బారిక్ వెల్లడించారు.

మూడు గంటలు నరక యాతన!

మూడు గంటలు నరక యాతన!