
నాగేశ్వరి గుహల్లో గేటు చోరీ
కొరాపుట్: వివాదాస్పద నాగేశ్వరి గుహల ప్రవేశ మార్గం గేటు చోరీకి గురయ్యింది. నందపూర్ సమితి నుంచి వెళ్లే ఈ మార్గంలో ప్రధాన గేటు చోరీ జరిగినట్లు స్థానికులు శుక్రవారం గుర్తించారు. సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో బల్దా నాగేశ్వరి గుహల పైభాగన విశాలమైన మైదానం ఉంది. అక్కడే పెద్ద సరస్సు, కింది వైపు నాగేశ్వరి గుహలు ఉన్నాయి. వీటిని తిలకించడానికి నిత్యం పర్యాటకులు తరలి వస్తుంటారు. మరోవైపు గుహల్లోని బాకై ్సట్ను తవ్వేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీటిని వ్యతిరేకిస్తూ గిరిజనులు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి ప్రవేశాలు నిషేధిస్తూ 2 నెలలు క్రితం స్థానికులు పెద్ద గేటు బిగించారు. దీనివల్ల గంజాయి స్మగ్లర్లకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యంలో గేటు చోరీ కావడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.