
జాజ్పుర్ జిల్లాలో ప్రబలిన డయేరియా
భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లాలో అతిసార పంజా విసిరింది. వ్యాధిలక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధాన ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు కేంద్ర రెవెన్యూ అధికారి (ఆర్డీసీ) వి.దీన్ జాజ్పూర్ జిల్లాలోని ధర్మశాల, వ్యాసనగర్ ఆస్పత్రులతోపాటు జిల్లా ప్రధాన ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. చికిత్సపొందుతున్న రోగులతోపాటు బంధువులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అతిసార వ్యాప్తి చెందడానికి కారణాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, ఆహార భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శి, జిల్లా కలెక్టర్, జిల్లా ముఖ్య వైద్య అధికారి, మండల అధికారి, వైద్యులతో మాట్లాడిసి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత ప్రజలకు తగిన వైద్య సేవలను అందించాలని ఆర్డీసీ ఆదేశించారు.
వ్యాధిపై ఆర్డీసీ సమీక్ష