ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

Jun 13 2025 5:09 AM | Updated on Jun 13 2025 5:09 AM

ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

మెళియాపుట్టి: రేగులపాడు ఆఫ్‌షోర్‌కు గ్రామాన్ని ఇచ్చిన చీపురుపల్లి నిర్వాసితులలకు న్యాయం జరగాలంటే ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆఫ్‌షోర్‌ నిర్వాసితులు చేపట్టిన నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకోవడంతో గురువారం చీపురుపల్లిలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడు తూ హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాలని కోరా రు. వలస కూలీలుగా పలు ప్రాంతాలకు వెళ్లిన 132 మంది నిర్వాసితులకు ప్యాకేజీలు లేవని అన్నారు. డీ పట్టా భూములకు సొమ్ములు చెల్లించాలని అన్నా రు. చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయని వాటిని సవరించి ఇళ్లకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. నిర్వాసితులందరూ ఏకతాటిపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఈశ్వరరావు, కొక్కిరి కిర ణ్‌, ఉమాశంకర్‌, వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement