
అల్పపీడనం
బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025
బలపడుతున్న
● రాష్ట్రానికి వర్ష సూచన
● పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
భువనేశ్వర్: రాష్ట్ర తీరప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షం తాకిడి అధికమయ్యే అవకాశాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) కార్యాలయం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రసరణ ప్రభావంతో రాష్ట్ర తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది. రానున్న 48 గంటల్లో తుపాను వాతావరణంపై స్పష్టత వస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ వరకు నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో 15 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. కొన్నిచోట్ల గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో రుతు పవనాలకు ముందు వర్షం కొనసాగుతోంది.
ఎల్లో అలెర్ట్
కొరాపుట్, మల్కన్గిరి, నవరంగ్పూర్, రాయగడ, గజపతి, కలహండి, కందమల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఆకస్మిక విపత్తుని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అనుబంధ యంత్రాంగంతో సన్నద్ధం కావాలని సూచించారు. పిడుగుపాటు విపత్తుపై సాధారణ ప్రజానీకానికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు వాతావరణంపై నిఘా ఉంచేలా చైనత్యపరచాల్సి ఉందన్నారు. ఉరుములు, మెరుపుల నుంచి రక్షణ పొందడానికి ప్రజలు సురక్షితమైన ఆశ్రయం పొందాలని కోరారు.
చేపల వేటపై అప్రమత్తం
సముద్రంలో చేపల వేటపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. వాతావరణ తాజా మార్పులకు అనుగుణంగా మత్స్యకారులు అనుక్షణం మెలకువతో వ్యవహరించాలని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఎస్ఆర్సీ పేర్కొంది. గాలివానలు, వడగండ్ల వాన, పిడుగులు, వర్షపాతం కారణంగా సంభవించిన నష్టంపై తక్షణమే క్షేత్రస్థాయి నివేదిక దాఖలు చేయాలని అధికారులకు సూచించింది.
న్యూస్రీల్

అల్పపీడనం

అల్పపీడనం