కొరాపుట్: మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు తగదని స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కొరాపుట్ జిల్లా విభాగ ప్రెసిడెంగ్ తరుణ్ కుమార్ మహాపాత్రో పేర్కొన్నారు. శనివారం జయపూర్ పట్టణంలోని నేషనల్ ఐబీలో జరిగిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ సభలో ప్రసంగించారు. కాలానుగుణంగా మీడియాలో మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎంత అభివృద్ది జరిగినా మీడియాపై దాడులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పవన్ పాణీగ్రాహి, సత్యనారాయణ పట్నాయక్, సన్న చౌదరి, శిశిర్ ఆచార్య, తదితరులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి..
జయపురం: మీడియా ప్రతినిధులు నిర్భయంగా విధులు నిర్వహించగలిగిన నాడే పత్రికలకు మనుగడ ఉంటుందని పలువురు పాత్రికేయులు అన్నారు. శనివారం ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛా దినం సందర్భంగా స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఒడిశా, కొరాపుట్ జిల్లా శాఖ సమావేశం నిర్వహించింది. స్థానిక రోడ్లు, భవణ నిర్మాణ విభాగ అతిథి గృహంలో జిల్లా అధ్యక్షుడు తరుణ్ మహాపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడారు. సమాజంలో పాత్రికేయులకు రక్షణ కల్పించేందుకు ప్రభత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు.