
జీడిపప్పు, పైనాపిల్ ఎగుమతి చేయండి
● జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అత్యధికంగా ఉత్పాదన అవుతున్న జీడిపప్పు, పైనాపిల్, మిరియాలు, రబ్బరు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే మైక్రో, చిన్న, మీడియం పరిశ్రమలదారులకు అధికంగా లాభాలు వస్తాయని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. కలెక్టరేట్ వద్ద ఆర్శెఠి భవనంలో జిల్లా స్థాయి జీడిపప్పు వెండర్ మొబిలైజేషన్ డ్రైవ్ కర్మశాలను శనివారం ప్రారంభించారు. ఈ వర్క్షాపు డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, మార్కెటింగ్ (ఒడిశా) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇతర అతిథులుగా ఎం.ఎస్.ఎం.ఈ జాయింట్ డైరెక్టర్ కమల్జిత్ దాస్, ఎగుమతి ప్రమోషన్ డైరెక్టర్ అశోక్ కుమార్ బెహరా, చీఫ్ ఎక్స్పోర్టు డిపార్ట్మెంట్ ఫెడరేషన్ కమలకాంత సాహు, ఇకో బ్యాంకు సాధారణ పర్యవేక్షకుడు నితీష్ మహంతి, సీఈఓ సంజయ్కుమార్ ప్రధాన్, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం సునారాం సింగ్ తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో 60కి పైగా జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఏ ఓక్క పారిశ్రామిక వేత్త ఎగుమతి చేయడం లేదని ఎం.ఎస్. ఎం.ఈ జాయింట్ డైరక్టర్ కమల్జిత్ దాస్ అన్నారు. భారత్ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తుందని, అందులో ఒడిశా రూ.440 కోట్ల ఎగుమతి చేసి 7వ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఒడిశా ఎగుమతుల్లో ఐదో స్థానంలో నిలబెట్టుకోవడానికి పారిశ్రామికవేత్తలు అడుగులు ముందుకువేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు పారాదీప్ ధమ్రా పోర్టు, భువనేశ్వర్ నుంచి దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్కు కార్గో ఎయిర్ ఫ్లైయిట్ నడుస్తుందని డైరెక్టర్, ఎక్స్పోర్టు ప్రమోషన్ అశోక్ కుమార్ బెహరా అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఎగుమతి చేయడానికి అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఇకో బ్యాంకు పర్యవేక్షకుడు నితీష్ మహాంతి అన్నారు. ఈ సంధర్బంగా ‘ఒడిషా ఎక్స్పోర్టు సక్సస్’ అనే బ్రోచర్ను అతిథులు విడుదల చేశారు. కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు జ్ఞాపికతో సత్కరించారు. జిల్లాలో వివిధ పారిశ్రామిక వేత్తలు పాల్గొని వస్తు ఎగుమతిపై తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ వర్క్షాపు భువనేశ్వర్ డైరెక్టరేట్, ఎగుమతి, మార్కెటింగ్ ప్రమోషన్శాఖ ఆధ్వర్యంలో జరిగింది.

జీడిపప్పు, పైనాపిల్ ఎగుమతి చేయండి

జీడిపప్పు, పైనాపిల్ ఎగుమతి చేయండి

జీడిపప్పు, పైనాపిల్ ఎగుమతి చేయండి