
క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
● జిల్లావ్యాప్తంగా 50 కేంద్రాల్లో శిక్షణ
శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు (సమ్మర్ కోచింగ్ క్యాంప్లు) గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు శాప్ సూచనలతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 శిక్షణ శిబిరాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. 22 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ శిబిరాల వద్దకు క్రీడాకారులు, బాలబాలికలు తరలివస్తున్నారు. దీంతో క్రీడా మైదానాల్లో సందడి వాతావరణం నెలకొంది. క్రీడాకారులు శారీరక ఫిట్ నెస్తోపాటు నిర్దేశిత క్రీడలో సాధన చేపడుతున్నారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడి యం వేదికగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సీఈవో పి.సుందరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా అవ సరమేనన్న విషయాన్ని విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు గుర్తించాలన్నారు. ఒలింపిక్ అసోసియేష న్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ క్రీడాకారులు తయారయ్యేది,ఓనమా లు దిద్దుకునేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలతోనేనని తెలిపారు. డీఎస్డీవో డాక్టర్ కె.శ్రీధర్రావు మాట్లాడుతూ జిల్లాలో 50 కేంద్రాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అత్యంత ఆదరణ కలిగిన క్రీడాంశాలకు పెద్దపీట వేశామన్నారు. కేంద్రాని కి రూ.7 వేలు చొప్పున శాప్ కేటాయించిందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాలబాలికలు సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యాటకాధికారి ఎన్.నారాయణరావు, టీటీ కోచ్ ఎం.మాధురీలత, పీడీలు చల్లా జగదీష్, ఎన్వీ రమణ, జి.అర్జున్రెడ్డి, రాజీవ్, పురుషోత్తం, క్రీడాసంఘాల ప్రతినిధులు, కోచ్లు, సీనియ ర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం