
శాశ్వత పట్టాలు ఇవ్వాలి
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ పంచాయతీ ముండిగుడ ఒడిశా కన్స్ట్రక్షన్ కాలనీ(ఓసీసీ) ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ నేత రవీంద్రమహాపాత్రో కోరారు. మహాపాత్రో నేతృత్వంలో వందలాది మంది ఓసీసీ ప్రాంత నివాసులు జయపురం సబ్ కలెక్టర్కు గురువారం వినతి పత్రం సమర్పించారు. 2019లో ఆ ప్రాంత నివాసులైన 250 పైగా కుటుంబాల వారు ఇళ్ల పట్టాలు కోసం విజ్ఞప్తి చేశారన్నారు. జిల్లా కలెక్టర్ 49 కుటుంబాలకు బరిణిపుట్ పంచాయతీలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేశారని వెల్లడిచారు. అంతకు ముందు ఆ ప్రాంతంలో ఉంటున్న 250 కుటుంబాలకు భూమి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. అయితే వారికి 7 ఎకరాల 50 సెంట్ల భూమి చూసి అక్కడ ఇళ్లు కట్టుకోమన్నారన్నారు. అందుకు కొంతమంది అందుకు అంగీకరించలేదని వివరించారు. తరువాత కాలంలో ఆ డొంగర భూమిని చదును చేసి ఇళ్లు కట్టు కొనేందుకు అంగీకరించారని అందు చేత అచ్చట నివాసం ఏర్పరుకున్న వారికి శాశ్వత పట్టాలు సమకూర్చి ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని సబ్కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ముండిగుడ వాసుల
విజ్ఞప్తి