
లక్ష్మీపూర్లో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత పర్యటించారు. మంగళవారం సమితిలోని గౌడ గుడ గ్రామ పంచాయతీ లక్ష్మణి గ్రామంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బలి జాతర ఏర్పట్లను పర్యవేక్షించారు. గ్రామ గిరిజనులతో సమావేశమై వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు.
తాను అందుబాటులో లేనప్పుడు తన తరఫున ఎంపీ ప్రతినిధి ఈ ప్రాంతంలో ఉంటారని, ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అంతకు ముందు గ్రామ సరిహద్దులలో గిరిజన యువతులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామ దేవతకు ఎంపీ, ఎమ్మెల్యే పూజలు చేశారు.