53 యూనిట్ల రక్తం సేకరణ | - | Sakshi
Sakshi News home page

53 యూనిట్ల రక్తం సేకరణ

Apr 30 2025 5:12 AM | Updated on Apr 30 2025 5:12 AM

53 యూనిట్ల రక్తం సేకరణ

53 యూనిట్ల రక్తం సేకరణ

జయపురం: ఉత్కళ గౌరవ్‌ మధుసూదన దాస్‌ జన్మదినం సందర్బంగా స్థానిక కొరాపుట్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. స్థానిక డిప్యూటీ రిజస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ వారు నిర్వహించిన శిభిరాన్ని కొరాపుట్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ పరిశీలన కమిటీ అధ్యక్షులు ఈశ్వర చంద్రపాణిగ్రహి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అన్ని దానాలకంటే గొప్పదన్నారు. అర్హులందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌ టెక్నిషియన్‌ అభయ పండ నేతృత్వంలో 53 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో కోఆపరేటివ్‌ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌ భీమసేన్‌ సాహు, కేసీసీ బ్యాంక్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రమాకాంత రౌళో, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శిశిర దాస్‌, జయపురం సబ్‌డివిజన్‌ రక్తదాతల మోటివేటెడ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రమోద్‌ కుమార్‌ రౌళో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement