
రోహింగ్యాలపై ఫిర్యాదు
కొరాపుట్: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలపై నబరంగ్పూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ పిర్యాదు చేసింది. మంగళవారం చాంబర్ ప్రతినిధులు ఎస్పీ మిహిర్ పండాను అతని కార్యాలయంలో కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాము కష్టపడి టాక్స్లు, విద్యుత్ బిల్లులు, కార్మికులకు వేతనాలు, సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నామన్నారు. సామాజిక అభివృద్ధిలో ఎన్నో వ్యయప్రయాసలు పడి భాగస్వామ్యం అయ్యామన్నారు. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చి ఈ ప్రాంతంలో బైక్ల మీద గ్రామాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. వారికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. వారి పూర్వ చరిత్ర కూడా ఎవరికీ తెలియదన్నారు. వీరి వలన సమాజంలో అసాంఘీక సమస్యలు ఏర్పడతాయన్నారు. ఎస్పీని కలిసిన వారిలో చాంబర్ ప్రెసిడెంట్ కను దాస్, సభ్యులు పి.ఎల్.మూర్తి, వి.మహేష్, రాకేష్ గుప్తా, తదితరులు ఉన్నారు.