
తీర ప్రాంతంలో భద్రత పెంపు
భువనేశ్వర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాష్ట్రంలో తీరప్రాంత భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవీ నది ముఖద్వారం వెంబడి అస్తరంగ్ మైరెన్ పోలీసు దళాలు నావికా దళ అధికారులు, మైరెన్ పోలీసుల సంయుక్త బృందంతో పహారా నిర్వహించారు. నదిలో మత్స్యకారుల గుర్తింపును పహారా బృందం తనిఖీ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పద కదలిక లేదా తెలియని వ్యక్తి సంచరిస్తే వారికి తెలియజేయాలని స్థానికుల్ని కోరారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లే ప్రతిసారీ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వారి మైరెన్ కార్డులు, వారి ఓటరు గుర్తింపు కార్డులను కూడా అడగాలని పోలీసు అధికారులు మత్స్యకారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే సంప్రదించగల ఫోన్ నంబర్ను కూడా అధికారులు మత్స్యకారులకు అందజేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దేవి నది ముఖద్వారం వద్ద భద్రతను పెంచారు. ఏదైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినట్లు అనుమానం వస్తే తక్షణమే తెలియజేయాలని మత్స్యకారులను ఆదేశించినట్లు ఒక అధికారి తెలిపారు.