స్వాభిమాన్‌ ఏరియాలో కలెక్టర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

స్వాభిమాన్‌ ఏరియాలో కలెక్టర్‌ పర్యటన

Apr 30 2025 5:11 AM | Updated on Apr 30 2025 5:11 AM

స్వాభిమాన్‌ ఏరియాలో కలెక్టర్‌ పర్యటన

స్వాభిమాన్‌ ఏరియాలో కలెక్టర్‌ పర్యటన

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్‌ ఏరియాలో మంగళవారం కలెక్టర్‌ ఆశీష్‌ ఈశ్వర్‌ పటేల్‌, ఎస్పీ వినోద్‌కుమార్‌ పటేల్‌ పర్యటించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మావోల అలజడి ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో గిరిజనులు ఎక్కువగా గంజాయి సాగు చేసేవారు. ఇప్పుడు బీఎస్‌ఎఫ్‌ జవాన్ల రాకతో మావోలు తగ్గిపోయారు. గిరిజనుల్లోనూ చైతన్యం వచ్చింది. ఈ సందర్భంగా గిరిజనులతో చర్చించిన కలెక్టర్‌ ఆశీష్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేతు యోజన పథకంలో ఈ ప్రాంతంలో గిరిజనుల ఉపాధి కోసం గాను పసుపు, చోడి, అల్లం తదితర పంటలు పండించుకునేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement