
ఘనంగా చాంబర్ ఆఫ్ కామర్స్ స్వర్ణోత్సవాలు
కొరాపుట్: జయపూర్ చాంబార్ ఆఫ్ కామర్స్ స్వర్ణోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. కొరపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతలు బాగుంటే వర్తక వాణిజ్య రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవానికి సంబంధించి సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీని పతి, మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత, ప్రెసిడెంట్ ప్రభాకర్, సెక్రటరీ డి.మాధవ, సలహాదారుడు శశి పట్నాయక్, అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి వచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.