
ఉత్సాహంగా కలర్ బెల్ట్ ప్రమోషన్
పర్లాకిమిడి: జిల్లా తైక్వాండ్ అకాడమీ తరఫున స్థానిక గుండిచా మందిరంలో కలర్బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు ఆదివారం అకాడమీ కార్యదర్శి కార్తీక్ చంద్ర మహాపాత్రో ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా బరంపురం తైక్వాండో అకాడమి నుంచి సత్యన్నారాయణ త్రిపాఠి, రాయగడ జిల్లా గుణుపురం నుంచి గణేష్ చంద్ర మహాపాత్రో వ్యవహరించారు. మొత్తం 99 మంది క్రీడాకారులు వైట్బెల్టు, ఎల్లో స్ట్రిప్, గ్రీన్, బ్లూ స్ట్రిప్లకు పోటీపడ్డారు. వారిలో 89 మంది ఆర్హత సాధించినట్టు అకాడమీ కార్యదర్శి కార్తీక్ మహాపాత్రో తెలిపారు. విద్యార్థులకు వచ్చేనెల నాలుగో తేదీన బెల్టులు ప్రదానం చేస్తామన్నారు.