
సాహిత్య సేవలు ప్రశంసనీయం
జయపురం: ప్రముఖ ఒడియా దినపత్రిక సంబాద్ ద్వారా నిర్వహిస్తున్న సంబాద్ సాహిత్య ఘర్ ఒడియా సాహిత్య ప్రగతికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సంబాద్ సాహిత్య ఘర్ ఎనిమిదో వార్షకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సంబాద్ సాహిత్య ఘర్ జయపురం అధ్యక్షులు ఉదయ శంకర జాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాహిణీపతి ప్రసంగింస్తూ సంబాద్ గ్రూపు అధినేత, మాజీ ఎంపీ సౌమ్యరంజన్ పట్నాయక్ సాహిత్య ప్రగతి, పరిరక్షణకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అంతేకాకుండా రక్త సేకరణకు ప్రత్యేక ఉద్యమం చేపట్టి సమాజానికి అనేక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంబాద్ సాహిత్య ఘర్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ శుభశ్రీ లెంక, సంబాద్ మీడియ సంస్థల అధినేత, మాజీ ఎంపీ సౌమ్యరంజన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు, సాహితీప్రియుడు మాధవ చౌధురిని సత్కరించారు.

సాహిత్య సేవలు ప్రశంసనీయం