
పర్లాకిమిడిలో ట్రాఫిక్ కంట్రోల్పై చర్యలు
పర్లాకిమిడి: ట్రాఫిక్ సమస్యపై ఏప్రిల్ 18న సాక్షి ప్రచురించిన కథనంపై జిల్లా పోలీసుశాఖ స్పందించింది. శుక్రవారం నుంచి పాత కోర్టు జంక్షన్, మార్కెట్, హైస్కూల్ జంక్షన్, అగ్నిమాపక కేంద్రం జంక్షన్, రాజవీధి దిగువన వన్వే ట్రాఫిక్ను అమలు చేశారు. పర్లాకిమిడిలో వాహనదారులు అస్తవ్యస్తంగా వాహనాలు నడుపుతుండటంతో అనేక మందికి గాయాలవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కూడలి వద్ద ట్రాఫిక్ కంట్రోల్ పోస్టును ఏర్పాటు చేశారు. అలాగే వన్వే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు మధ్య డివైడర్లను ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని సైన్బోర్డులు ఏర్పాటుచేశారు.

పర్లాకిమిడిలో ట్రాఫిక్ కంట్రోల్పై చర్యలు