రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

Apr 27 2025 1:20 AM | Updated on Apr 27 2025 1:20 AM

రెడ్‌

రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్రస్థాయిలో మూడు రోజుల జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభించారు. సెమిలిగుడ బ్లాక్‌ విద్యాధికారి చమేలి ముజుందార్‌ అధ్యక్షతన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయురాలు నివేదిత మహోదయ అతిథులకు స్వాగతం పలికి శిక్షణ శిబిరం ప్రాధాన్యతను వివరించారు. ఈ శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి 51 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ అధికారి హరికృష్ణ మహరాణ జూనియర్‌ రెడ్‌క్రాస్‌ శిక్షకులకు రెడ్‌ క్రాస్‌ చరిత్ర, ప్రాథమిక చికిత్స ప్రాధాన్యం, ట్రాఫిక్‌ నియమాలు, వివిధ సమాజ సేవా కార్యక్రమాలు వివరించారు. గౌరవ అతిథిగా రాష్ట్ర జూనియర్‌ రెడ్‌క్రాస్‌ అధికారి లక్ష్మణ స్వై, కొరాపుట్‌ జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ అధికారి సంజీవ కుమార్‌ దాస్‌, రెడ్‌క్రాస్‌ సాధన శిక్షకురాలు శుశ్మిత సాహు, రెడ్‌క్రాస్‌ మౌలిక సూత్రాలను వివరించారు. విద్యాలయాలలో జూనియర్‌ రెడ్‌క్రాస్‌ భూమికను తెలియజేశారు. సాధన శిక్షకులు సుజిత్‌ కుమార్‌ నాయక్‌ ప్రకతి వైపరీత్యాలలో జూనియర్‌ రెడ్‌క్రాస్‌ భూమికను వివరించారు.

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన అగ్నిమాపక యంత్రాలపై శనివారం అవగాహన కల్పించారు. ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది పలు యంత్రాలను ప్రదర్శనాత్మకంగా పని చేసి చూపించారు. జయపూర్‌ ఫైర్‌ అఫిసర్‌ సురేష్‌ చంద్ర బారిక, సిబ్బంది పాల్గొన్నారు.

కాశీనగర్‌లో కృష్ణచంద్ర గజపతి విగ్రహావిష్కరణ

పర్లాకిమిడి: మహారాజా కృష్ణచంద్రగజపతి జయంతి పురస్కరించుకుని కాశీనగర్‌ ఫారెస్టు జంక్షన్‌ వద్ద ఆయన విగ్రహాన్ని బరంపురం ఎంపీ ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రాహి శనివారం ఉదయం ఆవిష్కరించారు. గత కొన్నేళ్లుగా కాశీనగర్‌లో గజపతి విగ్రహాన్ని ఆవిష్కరించాలని స్థానికుల డిమాండ్‌ ఉంది. కాశీనగర్‌ ఎన్‌ఏసీ అధ్యక్షురాలు ఎం.సుధారాణి, పట్టణ బీజేపీ అధ్యక్షుడు బి.చలపతి, నళీనీ పాత్రో, ఎల్‌.చంద్రరావు, రొక్కం సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ మౌలిక

సూత్రాలను పరిరక్షించాలి

శ్రీకాకుళం అర్బన్‌: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ మౌలిక సూత్రాల రక్షణ అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.గేయానంద్‌ అధ్యక్షతన సమావేశం వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఎంబీవీ కేంద్రంలో ఏప్రిల్‌ 26, 27లలో జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజంలపై జరుగుతున్న దాడిని ప్రజాసైన్స్‌ ఉద్యమం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీడీఎఫ్‌ పూర్వ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, మాజీ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రమణ్యం, ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ఎన్‌) కార్యవర్గ సభ్యులు జి.మురళీధర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు రెడ్డి, వైస్‌ నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్‌ రాహుల్‌, ఎడ్యుకేషన్‌ సబ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ గొంటి గిరిధర్‌, సమత రాష్ట్ర కన్వీనర్‌ జి.నిర్మల, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌.జయప్రకాష్‌, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ ఖాలీషా బాషా, బి.మాణిక్యం శెట్టి తదితరులు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం 1
1/2

రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం 2
2/2

రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement