
ముమ్మరంగా ఎకై ్సజ్ దాడులు
రాయగడ: ఒడిశా – ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్ శాఖ అధికారులు బుధవారం ముమ్మరంగా దాడులు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాలైన శశిఖాల్, తంబలబాయి, సందుబడి, సనొ సందుబడి, పాణి ఛత్తర్, జొరుడి తదితర గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో భాగంగా తంబలబాయి గ్రామంలో 3,500 లీటర్ల ఊట, 300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పాణిఛత్తర్ గ్రామంలో 1,200 లీటర్ల ఊట, 80 లీటర్ల నాటుసార, జొరుడి గ్రామంలో 800 లీటర్ల ఊట, 40 లీటర్ల నాటుసారా, సందుబడి గ్రామంలో నిర్వహించిన దాడుల్లో 7 వేల లీటర్ల ఊట, 400 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అదేవిధంగా నాటుసార తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
విప్పపూవు స్వాధీనం
నాటుసారా తయారీకి వినియోగించే 3 వేల కిలోల విప్పపువ్వును అధికారులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జయానంద్ బచేలి, సబొజాన్ బచేలిలు ఉన్నారు. సందుబడి గ్రామంలో అక్రమంగా వ్యాన్లో విప్పపువ్వు తరలిస్తుండగా పట్టుబడ్డారు.

ముమ్మరంగా ఎకై ్సజ్ దాడులు