రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు
లైసెన్స్ల జారీలోనూ...
లైసెన్స్ల జారీకి గన్నవరంలో టెస్టింగ్ సెంటర్ ఉంది. ఇటీవల అక్కడ సెన్సార్లు ఏర్పాటు చేశారు. వాటిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. డ్రైవింగ్ చేసే సమయంలో సెన్సార్లు గుర్తిస్తాయి. దీంతో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అక్కడికి వెళితే ముడుపులు ఇస్తేనే టెస్టింగ్లో పాస్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వారు అడిగినంత ఇస్తే కారు నడపకుండానే లైసెన్స్లు ఇచ్చేస్తున్నట్లు చెపుతున్నారు. దీంతో లైసెన్స్ల జారీలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. వాస్తవంగా ద్విచక్ర వాహనం లైసెన్స్ కోసం అధికారిక ఫీజు రూ.960 చలానా రూపంలో చెల్లించాల్సి ఉంది. అదే బైక్, కారు రెండూ అయితే రూ.1260 చెల్లించాలి. కానీ ఏజెంటు బైక్కు రూ.3500 నుంచి రూ.4500 వరకూ వసూలు చేస్తున్నారు. కారు, బైక్ రెండూ అయితే రూ.7 వేల నుంచి రూ.8 వేలు తీసుకుంటున్నారు.
మా పరిధిలో లేదు
నున్నలోని ఫిట్నెస్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. దానిని తనిఖీ చేసే అధికారం కూడా మాకు లేదు. ఏదైనా సమస్య ఉంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఫిర్యాదు చేయాలి.
వాహనాలు ఫిట్నెస్కు తీసుకెళ్లారంటే యజమా నుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అధికారికంగా ఫీజును చలానా రూపంలో చెల్లించినా, ఫిట్నెస్ టెస్టింగ్ వద్ద అనధికారిక దోపిడీ పెరిగిపోయింది. దీంతో అక్కడ చేయి తడిపితేనే ఫిట్నెస్, లేదంటే ఏదో ఒక లోపం చూపించడంతో ఇవ్వక తప్పడం లేదు. ఇలా ఫిట్నెస్కే కాదు, లైసెన్స్ జారీ లోనూ సెన్సార్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో దోపిడీ మరింత పెరిగినట్లు చెపుతున్నారు. ఒకప్పుడు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమయంలోనే బాగుండేదని, ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించిన నాటి నుంచి దోపిడీ పెరిగిపోయిందని వాహనదారులు వాపోతున్నారు.
ఆన్లైన్ చిక్కులు...
డబ్బులు ఇస్తేనే ఫిట్నెస్ ఽధ్రువీకరణ
ఏదైనా లోపం ఉంటే అదనంగా
చెల్లించుకోవాల్సిందే
లైసెన్స్ల జారీలోనూ ఇదే పద్ధతి
సెన్సార్లు ప్రైవేటుకు
అప్పగించాక మరింత పెరిగిన దోపిడీ
–ఎ.మోహన్, జేటీసీ, విజయవాడ


