
నాణ్యమైన పరిష్కారమే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో దరఖాస్తుదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ స్వీకరించిన అర్జీలకు సంబంధించి కింది స్థాయి అధికారులు సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం తీసుకుని, పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పని చేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని సూచించారు
శాతవాహన కళాశాలను పరిరక్షించాలి..
శాతవాహన కళాశాల భవనాలను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని, కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి తదితరులు ఉన్నారు.
జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పీజీఆర్ఎస్లో 130 అర్జీల స్వీకరణ
వచ్చిన అర్జీలు ఇవే..
మొత్తం 130 అర్జీలు వచ్చాయని జేసీ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 39, పోలీస్ శాఖకు 21, ఎంఏయూడీ 26, పౌరసరఫరాలు 6, పంచాయతీరాజ్ 5, హెల్త్ 4, జలవనరులు 3, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 3, ఏపీసీపీడీసీఎల్ 3, విద్య 2, ఆర్అండ్బీ 2, ఆర్డబ్ల్యూఎస్ 2, డీఆర్డీఏ 2, సర్వే 2, వ్యవసాయం, డ్వామా, ఉపాధి హామీ, మార్కెటింగ్, ఏపీఎస్ఆర్టీసీ, స్కిల్ డెవలప్మెంట్, బ్యాంకు రిలేటెడ్, బీసీ వెల్ఫేర్, రిజిస్ట్రేషన్, ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన ఒక్కొ క్క అర్జీతో కలిపి మొత్తం 130 అర్జీలను స్వీకరించామని జేసీ పేర్కొన్నారు.