సాగునీటి విడుదలపై సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి విడుదలపై సందిగ్ధం

Jun 10 2025 7:18 AM | Updated on Jun 10 2025 7:18 AM

సాగున

సాగునీటి విడుదలపై సందిగ్ధం

కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..(ఎకరాలు లక్షల్లో)

కాలువ కృష్ణా ఎన్టీఆర్‌

బందరు 1.51 లక్షలు –

కేఈబీ 1.38 లక్షలు –

ఏలూరు 0.56 లక్షలు 1,332

రైవస్‌ 2.17 లక్షలు 425

మొత్తం 5.62 1,757

ఈ ఏడాది కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదించిన పనులు..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో సాగునీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. నీటిని విడుదల చేస్తే వరి పంట సాగు చేసేందుకుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ నిర్వాకం రైతుల శాపంగా మారుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితులు, నీటి ఇబ్బందులు ఉన్నా, పులిచింతలలో నీటిని నిల్వచేసి, జూన్‌ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. దీని ద్వారా పంట కోత సమయంలో తుఫాన్‌ల బారిన పడకుండా గట్టెక్కే పరిస్థితి ఉండేది. దీనికితోడు ముందుగా రెండో పంటగా మినుము సాగు చేయడంతో అధిక దిగుబడులు వచ్చేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గతేడాది జూలై నెలలో నీటిని విడుదల చేయడంతో పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ల బారిన పడి తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తుగా రుతుపవనాలు రావడం, ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటిని జూన్‌ మొదటి వారంలో విడుదల చేసే వెసులు బాటు ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన నీటి పారుదల సలహామండలి సమావేశంలో జూన్‌ 10వ తేదీన నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీనిపైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరచడంతో కృష్ణాడెల్టాకు నీటి విడుదలపైన నీలినీడలు కమ్ముకున్నాయి.

ముందుచూపు లేకపోవడంతోనే..

జూన్‌ మొదటి వారంలో నీటిని విడుదల చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. సాగునీటి కాలువల్లో పూడిక తీత, గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు, గండ్లు పూడ్చడానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10 లక్షల వరకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ అధికారులు కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షటర్ల మరమ్మతులు, కాంక్రీట్‌ పనులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, మార్చి నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పనుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేసింది. మే నెలలో పనులను మంజూరు చేసింది. కాలువలకు నీటిని విడుదల చేస్తే పనులు చేసేందుకు అవకాశం ఉండదు. పనులు చేయకుండా మమ అనిపించి నిధులు స్వాహా చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఇప్పటికి 40 శాతం పనులు కూడా ప్రారంభం కాలేదు. సకాలంలో పనులు చేయకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.

అధికార పార్టీ ఎమ్మెల్యేల పెదవి విరుపు..

సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే సాగునీటి కాలువల్లో పూడిక తీయకుండా, గండ్లు పూడ్చకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతులే గండ్లు పూడ్చుకోవాల్సిన దుస్థితి ఉందని పామర్రు ఎమ్మెల్యే పేర్కొనడం ప్రభుత్వ డొల్లతనానికి అద్దం పడుతోంది. బుడమేరు కాలువలో పూడిక తీయకలేదని, మురుగునీరు కాలువల్లోనూ పూడిక తీయలేదని ఎమ్మెల్యేలు నీటి సలహా మండలి సమావేశంలో పేర్కొన్నారు. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్‌లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో ఎక్కువగా పంట పొలాలు మునుగుతున్నాయి. గుర్రపుడెక్క, తూడుతో మేట వేసుకుపోయి నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్‌ఎన్‌ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల ఆయకట్టు

కాలువలకు గండ్లు పూడ్చని వైనం

తూటికాడ, గుర్రపుడెక్కతో

పేరుకుపోయిన కాలువలు, డ్రెయిన్లు

నిధులు మంజూరైనా.. నత్తనడకన పనులు

గత ప్రభుత్వ హయాంలో జూన్‌ మొదటి వారంలోనే నీటి విడుదల

డివిజన్‌ పనుల విలువ

సంఖ్య రూ.కోట్లలో

కృష్ణా తూర్పు 121 8.45

కృష్ణా సెంట్రల్‌ 144 7.28

డ్రెయినేజీవిభాగం 288 9.00

స్పెషల్‌ 15 1.30

మొత్తం 650 26.03

అధ్వానంగా కాలువలు

ప్రధాన కాలువలన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా తూడు, గుర్రపుడెక్క, జమ్మితో మేట వేసుకుపోయాయి. ఖరీఫ్‌ సీజన్‌ వచ్చినా కాలువల్లో తూడు తొలగింపు పనులు చేపట్టలేదు. హడావిడిగా చేపట్టే పనులు వల్ల కళ్లనీళ్లు తుడవటమే తప్ప రైతులకు ఒరిగిందేమీ ఉండదు. కాలువ చివరి భూములకు సాగునీరు ప్రశ్నార్థకమే.

– చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు

సాగునీటి విడుదలపై సందిగ్ధం 1
1/2

సాగునీటి విడుదలపై సందిగ్ధం

సాగునీటి విడుదలపై సందిగ్ధం 2
2/2

సాగునీటి విడుదలపై సందిగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement