యోగాంధ్రకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రకు విశేష స్పందన

Jun 10 2025 7:18 AM | Updated on Jun 10 2025 8:13 AM

యోగాం

యోగాంధ్రకు విశేష స్పందన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): యోగా ఆవశ్యకతను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, ఆయుష్‌ శాఖల ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్రతో కలిసి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా నేడు విశ్వవ్యాప్తమవుతోందని, నేడు ఎన్నో దేశాల ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకుంటున్నారన్నారు. యోగాసనాలు వేయండి.. ఆరోగ్యాన్ని కాపా డుకోండి.. అనే నినాదంతో యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

పోస్టర్‌ ఆవిష్కరణ..
అనంతరం ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ (1972 టోల్‌ ఫ్రీ నంబరు) నినాదంతో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డ్రగ్స్‌ భూతాన్ని సమాజం నుంచి తరిమేసే లక్ష్యంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, డ్రగ్స్‌ రహిత జిల్లా, రాష్ట్రం లక్ష్యంగా భాగస్వామ్య పక్షాలతో కలిసి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. యోగా మెగా ర్యాలీ కార్యక్రమంలో ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌, స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్‌ అసోసియేషన్స్‌, యోగా శిక్షణ సంస్థలు, యోగా గురువులు పాల్గొన్నారు.

టీచర్స్‌ యోగా..
యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం బీఆర్టీఎస్‌ రోడ్డు యోగా స్ట్రీట్‌ నందు టీచర్స్‌ థీమ్‌ యోగా జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ టీచర్స్‌తో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగాసనాల అభ్యసన ఉపయోగపడుతుందన్నారు. రిటైర్డ్‌ టీచర్‌ కె.ధనలక్ష్మి, కట్టుబడిపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు టి.రాజేశ్వరి, గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీ ఉపాధ్యాయురాలు ఎం.మాధవి, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. కొల్లేటి రమేష్‌, నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

యోగాంధ్రకు విశేష స్పందన 1
1/1

యోగాంధ్రకు విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement