
ఉయ్యూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక
ఉయ్యూరు రూరల్: ఉయ్యూరు డివిజన్ పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గ ఎన్నిక మండలంలోని కాటూరు గ్రామపంచాయతీలో ఆదివారం జరిగింది. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘ జనరల్ సెక్రటరీ జీటీవీ రమణ, కృష్ణా జిల్లా పంచాయతీ కార్యదర్శుల కోశాధికారి ఏఎస్ఆర్ కోటేశ్వరరావులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ
ఉయ్యూరు డివిజన్ అధ్యక్షుడిగా ఓగిరాల తిరుమల వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా ఎం. పద్మశ్రీవేణి, కేబీవీఎన్ఎం స్వామి, ప్రధాన కార్యదర్శిగా డి,మునిరాజు, పి.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా పీవీ సుబ్బారావు, బి.వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు
మచిలీపట్నం డివిజన్కు..
చల్లపల్లి: పంచాయతీ కార్యదర్శుల సంఘం మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడిగా చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పేర్ని వెంకట మాధవేంద్రరావును ఎన్నుకున్నారు. మచిలీపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డివిజనల్ పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో నూతన డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ జాయింట్ సెక్రటరీగా మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ కార్యదర్శి కె.రామకోటేశ్వరరావును ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా డీఎల్పీఓ వి.సీతారామయ్య వ్యవహరించగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శిల సంఘం ప్రతినిధి జీటీవీ రమణ, జిల్లా ట్రెజరర్ ఎ.ఎస్.ఆర్.కోటేశ్వరరావు పర్యవేక్షించారు
ఆంధ్ర కురియన్ జశ్వంతరావుకు భార్య వియోగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయ డెయిరీ వ్యవస్థాపకుడు, ఆంధ్ర కురియన్ డాక్టర్ వి.జశ్వంతరావు సతీమణి స్వర్ణకుమారి (85) మృతి చెందారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ మౌలాలిలోని స్వగృహంలో ఆమె కన్నుమూశారు. ఆమె మృతికి సీనియర్ జర్నలిస్టు వీకేఎం తిలక్ సంతాపం తెలిపారు.

ఉయ్యూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక