
క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. డీఆర్వో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పీజీఆర్ఎస్లో మొత్తం 167 అర్జీలు స్వీకరించినట్లు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తెలిపారు. ఇందులో రెవెన్యూ 65, పోలీస్ 30, మున్సిపల్ 14, పంచాయతీరాజ్ 6, సర్వే 4, డీఆర్డీఏ 5, వైద్య ఆరోగ్యం 2, హౌసింగ్ 8, ఏపీసీపీడీసీఎల్ 2, డ్వామా 2 , జలవనరులు 2, బీసీ కార్పొరేషన్కు 7, ఎస్సీ కార్పొరేషన్ 1, వ్యవసాయం 2, గ్రామ, వార్డు సచివాలయాలు 3, ఉపాధి కల్పన 1, మార్కెటింగ్ 2, ఆర్డబ్ల్యూఎస్ 1, ఆర్ అండ్ బీ 3, నైపుణ్యాభివృద్ధి 1, సాంకేతిక విద్య 1, విభిన్న ప్రతిభావంతులు 1, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 3, బ్యాంకింగ్ ఒకటి చొప్పున అర్జీలు అందాయి.
దివ్యాంగులకు ట్రైసైకిళ్ల అందజేత
కలెక్టరేట్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల సాయంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించారు. ట్రైసైకిళ్లు అందుకున్న వారిలో 21వ డివిజన్కు చెందిన సింహాద్రి క్షీరవర్థి, గొల్లపూడికి చెందిన అన్నవరపు వరప్రసాద్ ఉన్నారు.
●గుణదల ఆర్వోబీ ఫ్లై ఓవర్ను పునరుద్ధరించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో డీఆర్వో లక్ష్మీనరసింహంకు అర్జీ అందజేశారు.
డీఆర్వో లక్ష్మీనరసింహం పీజీఆర్ఎస్లో 167 అర్జీలు