
భక్తిరస భరితం త్యాగరాజ చరితం
విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన సద్గురు త్యాగరాజస్వామి 258వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంగీత ఉత్సవాలు ముగింపుదశకు చేరుకున్నాయి.
కార్యక్రమంలో శనివారం టీవీఎస్ అరవింద్, అంబటిపూడి సర్వజ్ఞ, కే మురారి, చింతలపాటి పూజిత, అద్దేపల్లి వంశీ కృష్ణ, హరిద్ర మ్యూజికల్ అకాడమీ, మృత్తిక త్యాగరాజస్వామి కృతులను ఆలపించారు.త్యాగరాజస్వామి చరితం భక్తిముక్తి దాయకమని సంగీత విద్వాంసుడు సంగీత ప్రయోక్త, వాగ్గేయకారుడు పోవూరి గౌరీనాథ్ హరికథా సంప్రదాయం కాపాడానికి తొలిప్రయత్నంగా త్యాగరాజ చరితం కథను గానం చేశారు. నేటి త్యాగరాజస్వామి జననం, సంగీతాభ్యాసం, రామసేవల తరించడం, కీర్తనం ద్వారా ముక్తిని సాధించవచ్చునని భావించి శ్రీ రామచంద్రుని మీద కీర్తనలు రచించడం తదితర అంశాలను మధురంగా గానం చేశారు. వయోలిన్పై పాలపర్తి ఆంజనేయులు, మృదంగంపై బి.సురేష్బాబు సహకరించారు.
నేటితో సంగీతోత్సవాలు ముగింపు..
వారం రోజులుగా నిర్వహిస్తున్న సంగీత ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. 10.30 గంటలకు త్యాగరాజస్వామి రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు, 11.30 త్యాగరాజస్వామికి నాట్యాచార్య చింతారవి బాలకృష్ణ బృందంచే నృత్యనీరాజనం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.