న్యూస్రీల్
రికవరీ ఇంకెప్పుడు..
మాక్లూర్ సొసైటీ పాలకవర్గం, సిబ్బంది వాడుకున్న డబ్బును ఇంకెప్పుడు రికవరీ చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు.
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్ మార్కెట్ యార్డులోని పసుపు కుప్పల వద్ద నీటిని తొలగిస్తున్న మహిళా రైతు
అకాల వర్షం అన్నదాతను తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేతికొచ్చిన సమయంలో తీరని నష్టం కలిగించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి, మొక్కజొన్న, నువ్వు పంట నేలవాలింది. మామిడికాయలు రాలిపోగా, కల్లాల్లోని పసుపు తడిసి ముద్దయ్యింది. రోడ్ల పక్కన చెట్లు విరిగిపడ్డాయి.


