నాగమడుగు ఎత్తిపోతలపై అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

నాగమడుగు ఎత్తిపోతలపై అధ్యయనం

Mar 30 2026 7:27 AM | Updated on Mar 30 2026 7:27 AM

పనులను పరిశీలించిన

ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): మంజీరా నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పనుల పూర్తి, భూముల ముంపు నివారణపై నిపుణుల బృందం నివేదికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆదివారం ఒడ్డేపల్లి శివారులో ఉన్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులను సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజింగ్‌ ఎస్‌ఈ జహీర్‌తో పాటు ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల బృందం ఇంజినీర్లు పరిశీలించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులతో వందల ఎకరాల భూములు ముంపునకు గురవుతుండటంతో పాటు రైతుల ఆందోళనలు, నష్టపరిహారం చెల్లింపులు తదితర విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని పంపింది. అంతేకాకుండా రీడిజైనింగ్‌ కోసం ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేయడంతో ఇంజినీర్లు పనులను పరిశీలించి ప్రభుత్వాని నివేదిక ఇవ్వనున్నట్లు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజింగ్‌ ఎస్‌ఈ జహీర్‌ తెలిపారు. బాన్సువాడ నీటిపారుదలశాఖ ఎస్‌ఈ దక్షిణామూర్తి, ఈఈలు సాలోమాన్‌, చంద్రశేఖర్‌, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఇంజినీర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement