నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్యసమాజంలో రాధాకృష్ణ పాఠశాల 1972–73 ఏడో తరగతి మొదటి బ్యాచ్ విద్యార్థులు స్వర్ణోత్సవాలు ఆదివారం నిర్వహించారు. 54 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ ఒక్కచోట కలిశారు. సమ్మేళనంలో విద్యార్థుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ పాఠశాల అధ్యక్షుడు సూర్యప్రకాష్, కార్యదర్శి నా రాయణ, ప్రధానోపాధ్యాయులు సునీత, పాత ప్రధానోపాధ్యాయులు ఎంపీ రాజులు, ఉపాధ్యాయులు శంకర్ను సన్మానించారు.
సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు


