రెండో విడతకు రెడీ..
● నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
● 59 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
● 2,64,178 మంది ఓటర్లు
సుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నోటిఫికేషన్ ఆదివారం వెలువడనుండగా, ఉ దయం 10.30 గంటల నుంచి నా మినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుంది. నిజామాబాద్ డివిజన్ (ఆ ర్మూర్ డివిజన్లో ఒక మండలం) లో రెండో విడత పంచాయతీ ఎ న్నికలు జరగనున్నాయి. 196 జీపీలు, 1,760 వార్డు స్థానాలు, 1,760 పోలింగ్ కేంద్రాలు ఉ న్నాయి. మొత్తం 2,64,178 మంది ఓటర్లు ఉండగా, 1,22,868 మంది పురుషులు, 1,41,305 మంది మహిళలు, 5 ఇతరులు ఉన్నారు.
డిసెంబర్ 2 వరకు..
రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నది. డిసెంబర్ 3న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు మూడు గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.
క్లస్టర్ గ్రామంలో నామినేషన్ల స్వీకరణ..
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండోవిడత నామినేషన్ల స్వీకరణ కోసం 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచి, వార్డుస్థానాల అభ్యర్థుల నామినేషన్లను అక్కడే స్వీకరించనున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.
గ్రామ పంచాయతీ రెండోవిడత నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారె డ్డి శనివారం తెలిపారు. మొదటి విడతలో భాగంగా బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని 11 మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సజావుగా పూర్తి చే శామని పేర్కొన్నారు. రెండో విడతకు ఆదివా రం నుంచి డిసెంబర్ 2 వరకు నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లలోని పలు మండలాలకు నా మినేషన్లు స్వీకరిస్తామన్నారు. హెల్ప్డెస్క్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.
నిజామాబాద్ డివిజన్లో రెండోవిడత..
రెండో విడతకు రెడీ..


