
రేపు ‘స్థానిక’ తుది ఓటరు జాబితా
● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్అర్బన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10వ తేదీన వెలువరించనున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబి తా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ము సాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని సూ చించారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమై న మార్పులు, చేర్పులు చేసిన తరువాత 10వ తేదీ న తుది జాబితా వెలువరిస్తామని అన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశంలో సైతం అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.