ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

Jul 1 2025 7:16 AM | Updated on Jul 1 2025 7:16 AM

ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

నిజామాబాద్‌అర్బన్‌: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, మెప్మా పీడీ రాజేందర్‌కు అర్జీలను సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement