నిర్మల్‌ డీఆర్డీవోకు అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ డీఆర్డీవోకు అరుదైన గౌరవం

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

● హెచ్‌ఆర్సీపీసీలో శాశ్వత సభ్యురాలిగా అవకాశం

నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్‌ గౌరవ్‌రత్నశ్రీ సమ్మాన్‌’ పురస్కారాల కార్యక్రమంలో నిర్మల్‌ డీఆర్డీవో కె.విజయలక్ష్మి గౌరవ డాక్టరేట్‌ స్వీకరించారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. తొమ్మిది దేశాలకు చెందిన హైకమిషనర్లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించగా, దేశవ్యాప్తంగా వందమందిని ఎంపికచేసి పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విజయలక్ష్మికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆమెను హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ శాశ్వత సభ్యురాలిగా కూడా నియమించారు. శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప మహిశిని, కాన్సులేట్‌ జనరల్‌ కేఎల్‌ గంజు తదితరులు పాల్గొని డాక్టరేట్‌తోపాటు, ఽశాశ్వతసభ్యురాలిగా ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement