లోకేశ్వరం: చేపల వలకు చిక్కుకుని జాలరి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాథ్గాం గ్రామానికి చెందిన జాలరి పల్లికొండ సతీష్ (31) గురువారం ఉదయం చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని మాల్కాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో వేసిన వలను తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


