క్యాంపులోనే బీజేపీ కౌన్సిలర్లు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో గెలిచిన ఆభ్యర్థులతో ఆయా పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఏ పార్టీకి సరైన మెజారిటీ లేకపోవడంతో ఇతర కౌన్సిలర్ల మద్దతుగా కోసం వేచిచూస్తున్నాయి. సోమవారం జరిగిన సమావేశానికి కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్ మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం వాయిదా వేశారు. కాగా క్యాంపులో ఉన్న బీజేపీ కౌన్సిలర్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


