ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి

May 5 2025 9:06 AM | Updated on May 5 2025 9:06 AM

ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి

ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి

నిర్మల్‌టౌన్‌ : ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7 నుంచి చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని నిర్మల్‌ డిపో జేఏసీ చైర్మన్‌ పోశెట్టి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్‌ డిపో ఆవరణంలో సమ్మె పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్‌ యూనియన్‌లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌, కన్వీనర్లు నారాయణ, శేఖర్‌, హనుమంతు, రాజేశ్వర్‌, వేణు, మహిళా కండక్టర్లు ప్రతిభా, సవిత, శ్రీదేవి, సురేఖ, శ్రీలత, సజన, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement