
మృతదేహాలను తెప్పించేందుకు ఆదేశం
సోన్: ఇటీవల దుబాయ్లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణవాసుల మృతదేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించేందుకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి గు రువారం ఓ ప్రకటనలో తెలిపారు. జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి గురువారం స్పందించి ఆదేశించారని పేర్కొన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, మృతదేహాలను త్వరగా ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని అధి కారులను ఆదేశించినట్లు తెలిపారు. సోన్ మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్సాగర్ దుబాయ్లో బేకరీషాప్లో పాకిస్తానీయుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాణ్యమైన సేవలందిస్తాం
ఖానాపూర్: ఖానాపూర్ బీఎస్ఎన్ఎల్ కా ర్యాలయం పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈ శర్మన్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సేవా శిబిరానికి హాజరై మాట్లాడారు. సేవల్లో ఎలాంటి అంతరాయమున్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలూ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్డివిజనల్ ఇంజినీర్ రమ్యజ్యోతి, డీలర్ రమణప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.