
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్ను విజయవంతంగా పరీక్షించి.. భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైళ్లు.. కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి హానికరం కాని, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఇది భారతీయ రైల్వేను మరింత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయడంతో ముందడుగు పడింది.
ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడం.. భారత్ని హైడ్రోజన్ ఆధారిత రైల్వే సాంకేతికతలో ప్రపంచదేశాల సరసన అగ్రగామిగా నిలబెడుతుందని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. భారత్ 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఇది దేశీయ రవాణా రంగానికి ఒక కీలక మైలురాయి’’అని ఆయన పేర్కొన్నారు. మొత్తం హైడ్రోజన్-పవర్డ్ కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ఐసీఎఫ్ వద్ద విజయవంతంగా పరీక్షించబడిందన్నారు.
First Hydrogen powered coach (Driving Power Car) successfully tested at ICF, Chennai.
India is developing 1,200 HP Hydrogen train. This will place India among the leaders in Hydrogen powered train technology. pic.twitter.com/2tDClkGBx0— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 25, 2025
హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లను దేశ వ్యాప్తంగా హెరిటేజ్, హిల్ స్టేషన్లలో నడపాలని భావిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్తో నడిచే విధంగా చేసే పైలట్ ప్రాజెక్ట్ను కూడా రైల్వేశాఖ చేపట్టింది.