
పరిశుభ్రత విషయంలో పోటీ పడండి
ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
నాలుగు టవర్లకు నదుల పేర్లు
ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్ల సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను నివాస ప్రాంగణాల్లోనే జరుపుకోవాలని, అదే సమయంలో పరిశుభ్రత విషయంలో పోటీ పడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రజలను ఐక్యంగా ఉంచుతున్న వేర్వేరు నదుల పేర్లను నాలుగు టవర్లకు పెట్టామని ఆయన చెప్పారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఒక టవర్కు కోసి నది పేరును పెట్టామంటూ కొందరు అల్పబుద్ధితో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లక్షలాది మందికి జీవం పోసే ఈ నదులు ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లో కొత్త ఆనందాలకు ప్రేరణగా నిలుస్తా యి’అని ఆయన అన్నారు. ఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్లో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్కు సమీపంలో నిర్మించిన మరో మూడు టవర్లకు కృష్ణా, గోదావరి, హూగ్లీ నదుల పేర్లను పెట్టారు.
కాంప్లెక్స్లో మొత్తం 184 ఫ్లాట్లు న్నాయి. అత్యా« దునిక వసతులు, పక్కాగా భద్రతా ఏర్పాట్లను కల్పించారు. ఎంపీలకు ఇళ్ల కొరత ఇబ్బందిగా మారిందని, మొదటిసారి ఎంపీలైన వారికి ఇల్లు దొరకడమే కష్టంగా మారిందని ప్రధాని ఫ్లాట్ల ప్రారంభం సందర్భంగా తెలిపారు. 2004–2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంపీలకు కొత్తగా నివాసాలను నిర్మించనే లేదని ఆయన పేర్కొ న్నారు. పాతబడిన భవనాల్లో ఎంపీలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. తాము అధికారంలోకి వచ్చాక 350 ఫ్లాట్లను ఎంపీల కోసం నిర్మించామని చెప్పారు. ఇక మునుపటి ఇబ్బందులేవీ ఉండవని హామీ ఇచ్చారు. తాజాగా నిర్మించిన ఫ్లాట్లు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలంగా ఉన్నాయని వివరించారు.

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఈ ప్రాంగణాల్లో బస చేస్తారని.. ఇది ’ఏక్ భారత్– శ్రేష్ఠ భారత్’ ఆలోచనకు ప్రతీక అని అన్నారు. వివిధ రాష్ట్రాల పండుగలను సమష్టిగా ఇక్కడ జరుపుకోవడం గొప్ప అనుభూతినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఎంపీలు తమ నియోజ కవర్గ ప్రజలను కూడా వేడుకల్లో భాగస్వాములుగా చేసుకోవచ్చన్నారు.
ఇక్కడుండే ఎంపీలు, పరి శుభ్రతను తమ కర్తవ్యంగా భావించాలని, ఈ విష యంలో ఏటా రెండుమూడు పర్యాయాలు పోటీలు పెడితే బాగుంటుందని సంబంధిత శాఖను, కమిటీ లను కోరుతానని తెలిపారు. ఈ పోటీలో పరిశు భ్రతలో అత్యుత్తమైన బ్లాక్ పేరును ప్రకటిస్తా రన్నారు. మరో ఏడాది తర్వాత, ఉత్తమ బ్లాక్, చెత్తగా ఉండే బ్లాకులను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. సముదాయం ఆవరణలో అనంతరం ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటారు. భవన నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బందితో ముచ్చటించారు. వారి కృషిని కొనియాడారు.