అఫీషియల్‌: దక్షిణాదిలోనూ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, ఏ రూట్‌లో అంటే..

Indian Railways to launch fifth Vande Bharat train in South India - Sakshi

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు  దక్షిణ భారతంలో అందుబాటులోకి రానున్నాయి. ఐదవ రైలును నవంబర్‌ 10వ తేదీన 483 కిలోమీటర్ల పొడవైన చెన్నై–బెంగళూరు, మైసూరు మార్గంలో ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లుండే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం ఎక్కువ. వచ్చే ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వందేభారత్‌ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top